అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. కాళ్లకు దండం పెట్టే సంస్కృతి వీడాలని సీఎం పిలుపునిచ్చారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో చంద్రబాబు మీడియాతో చిట్ చాట్ చేశారు. ఎవరైనా నా కాళ్లకు దండం పెడితే.. వారి కాళ్లకు నేను దండం పెడతా అన్నారు. ఇవాళ్టి నుంచి నా కా కాళ్లకు దండం పెట్టే విధానానికి ఫుల్ స్టాప్ పెడుతున్నానని వెల్లడించారు. తల్లిదండ్రులు, భగవంతుడి కాళ్లకు దండం పెట్టాలి తప్ప నాయకులకు కాదన్నారు. నాయకుల కాళ్లకు దండం పెట్టి ఎవరూ గత గౌరవాన్ని తగ్గించుకోవద్దని కోరారు. నాయకుల కాళ్లకు ప్రజలు, పార్టీ శ్రేణులు దండం పెట్టొద్దనే సంస్కృతితి నా నుంచే ప్రారంభిస్తున్నాని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు, ప్రజల నుంచి చంద్రబాబు వినతులు స్వీకరించారు.