గాలె: న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక తొలి రోజే పట్టు బిగించింది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆతిథ్య శ్రీలంక 90 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 306 పరుగులు చేసింది. మాథ్యూస్ (78*), యువ ప్లేయర్ కమిందు మెండిస్ (51*) అజేయ అర్ధ సెంచరీలతో క్రీజులో ఉన్నారు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్కు దిగిన శ్రీలంక జట్టులో దినేశ్ చండీమల్ (116) శతకంతో చెలరేగాడు. సౌతాఫ్రికా బౌలర్లలో సౌథీ, ఫిలిప్స్ తలో వికెట్ తీసుకున్నారు. భారత్తో ఒకే ఇన్నింగ్స్లోనే 10 వికెట్లు తీసిన కివీస్ తురుపుముక్క అజాజ్ పటేల్ ఘోరంగా తేలిపోయాడు.