‘సప్త సాగరాలు దాటి’ వచ్చి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది రుక్మిణి వసంత్. తెలుగు ప్రేక్షకుల ఆదరణ పొందిన ఆ డబ్బింగ్ చిత్రంలో అందం, అభినయంతో న్యాచురల్ బ్యూటీ అనిపించుకుంది. ఆ సినిమా తర్వాత టాలీవుడ్లో మంచి సినిమాతోనే వస్తుందని అంతా అనుకున్నట్టే, ఈ అమ్మడు తెలుగులో భారీ ప్రాజెక్టునే పట్టేసినట్టు తెలుస్తోంది.
ఎన్టీఆర్ ‘దేవర’ పార్ట్-1 తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. ‘డ్రాగన్’ అనే పేరుతో ఈ సినిమా తెరకెక్కనుందని చాలా రోజులుగా అనుకుంటున్నారు. తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్గా ఎంపికయ్యిందట.
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే రుక్ష్మిణి చీరకట్టులో ఉన్న తాజాగా ఫొటోల్లో కనువిందు చేస్తోంది. ఎన్టీఆర్ సరసన నటించే అవకాశం దక్కించుకుందని ప్రచారం జరుగుతుండటంతో ఈ ఫోటోల కింద ‘ఎన్టీఆర్-నీల్’ ప్రాజెక్టులోకి స్వాగతం’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.