29-03-2025 03:39:59 PM
కొండాపూర్: కొండాపూర్ మండల కేంద్రంలో ప్రధాన రోడ్డు పక్కన చలివేంద్రం ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీడీవో శ్రీనివాస్ మాట్లాడుతూ వేసవి బారి నుంచి ప్రజలు తమకు తాముగా రక్షించుకోవాలని డాక్టర్లు చెప్పే సూచనలు పాటించాలని, అత్యవసర సమయాల్లో మాత్రమే బయటికి వెళ్లాలని, బయటికి వెళ్లేటప్పుడు ఒక టవలు లేదా గొడుగును వాడాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ ( ఉప తహసిల్దార్) మర్రి ప్రదీప్ కుమార్, కొండాపూర్ పంచాయతి సెక్రటరీ ఓం ప్రకాష్, కొండాపూర్ మాజీ సర్పంచ్, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.