calender_icon.png 23 October, 2024 | 10:53 AM

అభివృద్ధి పనుల్లో వేగం పెంచండి

12-08-2024 03:20:44 PM

పటాన్ చెరు: కాలనీలలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి అధికారులను ఆదేశించారు. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని నరేంద్ర కాలనీ, పిఎన్ఆర్ కాలనీ, సాయి అంబికా కాలనీలలో చేపడుతున్న మంచినీటి పైపులైన్లు, రహదారి నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా పాండురంగారెడ్డి మాట్లాడుతూ.. నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. మున్సిపల్ పరిధిలోని ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు అయినప్పుడే వాటికి సార్థకత చేకూరుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జ్యోతి రెడ్డి, హెచ్ఎండబ్ల్యూఎస్ డీజిఎం చంద్రశేఖర్, కౌన్సిలర్ కృష్ణ, తలారి రాములు, తదితరులు పాల్గొన్నారు.