calender_icon.png 21 September, 2024 | 8:35 AM

మున్నూరు కాపు కార్పొరేషన్‌కు చైర్మన్‌ను నియమించాలి

21-09-2024 02:51:58 AM

మంత్రి కొండా సురేఖను కోరిన సంఘం నాయకులు 

హైదరాబాద్, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి):  రాష్ట్రంలో మున్నూరు కాపు కార్పొ రేషన్‌కు చైర్మన్‌ను వెంటనే నియమించాలని ప్రభుత్వాన్ని ఆ సంఘం నాయకులు కోరారు. శుక్రవారం తెలంగాణ వెనుకబడిన తరగతుల సాధికారత సంఘం ఆధ్వర్యంలో మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మున్నూరు కాపు సంఘం రాష్ర్ట అధ్యక్షుడు కొండ దేవయ్య ఆధ్వర్యంలో ఆమెను సత్కరించారు. అనంతరం మంత్రి సురేఖ మాట్లాడుతూ సీఎంరేవంత్ రెడ్డి దృష్టికి విషయాన్ని తీసుకుపోయి మున్నూరు కాపు కార్పొరేషన్‌కు చైర్మన్‌ను నియమించేలా చర్యలు చేపట్టి,కాపుల సంక్షేమం పై చర్చిస్తానని హామీ ఇచ్చారు.  కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే మున్నూరు కాపు కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసిందని తెలిపారు.