బ్రిటన్ ప్రకటన
లండన్, అక్టోబర్ 3: బ్రిటన్ సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. చాగో స్ దీవులపై సార్వభౌమాధికారాన్ని మారిషస్కు ఇస్తున్నట్లు ప్రకటించింది. కానీ డియాగో గార్సియాలో అమెరికా తో పాటు కలిసి సంయుక్త సైనిక స్థావరాన్ని నిర్వహిస్తామని స్పష్టం చేసింది. రెండేళ్ల చర్చల తర్వాత వివాదాలకు పరిష్కారం దొరికిందని, ఒప్పంద నియమాలను పాటించడం వల్లనే ఇది సాధ్యమైందని బ్రిటన్, మారిషస్ సం యుక్త ప్రకటనలో తెలిపాయి. హిందూ మహాసముద్రంలో ఈ ద్వీపాలను అప్పగించాలని బ్రిటన్పై ఎప్పటినుంచో ఒత్తిడి ఉంది.