సిరిసిల్ల, జనవరి 26 (విజయ క్రాంతి): ఉత్తమ సేవలు నిర్వహించినందుకు స్పెషల్ బ్రాంచ్ లో విధులు నిర్వహిస్తున్న బుట్టం దేవరాజుకు ప్రశంసా పత్రం అందజేశారు. ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ చేతుల మీదుగా దేవరాజుకు ప్రశంస పత్రం అందజేశారు.
కోనరావుపేట, చందుర్తి, రుద్రంగి మండలాల్లో స్పెషల్ బ్రాంచ్ అధికారిగా మెరుగైన సేవలు అందించినందుకు ప్రభుత్వం పక్షాన ఈ ప్రపంచంలో అందజేశారు. కాగా దేవరాజును పలువురు పోలీస్ అధికారులు అభినందించారు.