calender_icon.png 21 October, 2024 | 11:00 AM

రంజీలో సెంచరీల మోత

20-10-2024 12:00:00 AM

శతకాలతో మెరిసిన ఇషాన్, శ్రేయస్

న్యూఢిల్లీ: రంజీ ట్రోఫీలో రెండో రౌండ్ మ్యాచ్‌ల్లోనూ ఆయా జట్ల నుంచి 11 మంది ఆటగాళ్లు శతకాలతో కదం తొక్కారు. టీమిండియాలో రీఎంట్రీ ఇచ్చేందుకు తహతహలా డుతున్న శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ సెంచరీలతో మెరిశారు. ఎలైట్ గ్రూప్ మహారాష్ట్రతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై 441 పరుగులు భారీ స్కోరు సాధించింది.

ఆయుశ్ హత్రే (176), శ్రేయాస్ (142) భారీ శతకాలు సాధించారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో మహారాష్ట్ర వికెట్ నష్టానికి 142 పరుగులు చేసి ఎదురీదుతోంది. ఎలైట్ గ్రూప్-బిలో ఉత్తరాఖండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో హైదరాబాద్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది.

ఇక రెండో రోజున విదర్భ తరఫున (యశ్ రాథోడ్) , హర్యానా తరఫున (హిమాన్షు, ధీరు సింగ్), జార్ఖండ్ తరఫున (విరాట్ సింగ్, ఇషాన్ కిషన్), చంఢీఘర్ తరఫున రాజ్ బవా (122 నాటౌట్), తమిళనాడు తరఫున (వాషింగ్టన్ సుందర్, ప్రదోశ్ పాల్), త్రిపుర తరఫున శ్రీదమ్ పాల్ శతకాలు సాధించారు.