calender_icon.png 18 October, 2024 | 1:23 PM

కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే కేంద్రాన్ని బదనాం చేస్తోంది..

27-07-2024 01:21:39 PM

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే కేంద్రాన్ని బదనాం చేస్తోందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ కుమార్ అన్నారు. కేంద్రబడ్జెట్ పైఅనవసరమైన నిందలు మోపుతున్నారని బండి సంజయ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తప్పుదారి పట్టిస్తోందన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని బండి సంజయ్ పునరుగ్ఘటించారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలనే కాంగ్రెస్ ఇప్పుడు చేస్తోందని ఆరోపించారు. విమర్శలు, ప్రతివిమర్శలు పక్కన పెట్టి అభివృద్ధిపై ఆలోచన చేయాలని ప్రభుత్వానికి సూచించారు.