calender_icon.png 10 October, 2024 | 8:56 PM

ఏపీ, తెలంగాణ కేడర్ విభజనపై కేంద్రం కీలక నిర్ణయం

10-10-2024 06:26:36 PM

న్యూఢిల్లీ,(విజయక్రాంతి): ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కేడర్ విభజనపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమకు తెలంగాణ క్యాడర్ కావాలన్న 11 మంది ఐఏఎస్, ఐపీఎస్ ల అభ్యంతరాలను కేంద్రం తోసిపుచ్చింది. దీంతో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, తెలంగాణ విద్యుత్ శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్, వాణి ప్రసాద్, మల్లెల ప్రశాంతి అభ్యర్థన తిరస్కరించిన కేంద్రం ఏపీకి వెళ్లాలని ఐపీఎస్ లు అంజనీకుమార్, అభిలాష బిస్త్, అభిషేక్ మొహంతి తదితరులు తెలంగాణకు కేటాయించాలని కేంద్రాన్ని అభ్యర్థించారు. వారి అభ్యర్థనలను తిరస్కరించిన కేంద్రం తెలంగాణ నుంచి రిలీవ్ చేస్తూ డీవోపీటీ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ నుంచి ఏపికి వెళ్లి ఈనెల 16లోగా సొంత రాష్ట్రంలో రిపోర్ట్ చేయాలని కేంద్రం ఆదేశించింది.