calender_icon.png 27 October, 2024 | 10:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అయ్యప్ప భక్తులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు

27-10-2024 12:00:00 AM

న్యూఢిల్లీ, అక్టోబర్ 26: శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. విమానాల్లో శబరిమల వెళ్లే అయ్య ప్ప భక్తులు తమ క్యాబిన్(టూరిస్ట్) బ్యాగులలో కొబ్బరికాయలను తీసుకెళ్లడానికి అనుమతి ఇస్తున్నట్టు ప్రకటించింది. ఈ విషయాన్ని కేంద్ర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ట్విట్టర్ వేదికగా వెళ్లడించారు.

ఈ మినహాయింపు మూడు నెలలపాటు అంటే 2025 జనవరి 20 వరకు మాత్రమే ఉంటుందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. సంప్రదాయాలకు ప్రాధాన్యత ఇస్తూనే భక్తుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. ఇదే సమయంలో అన్ని రకాలైన భద్రతాపరమైన చర్యలు కూడా తీసుకున్నట్లు చెప్పారు. కాగా.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ఇరుముడి సమర్పించే అయ్యప్ప స్వామి భక్తులకు మేలు చేకూరనుంది.