calender_icon.png 22 October, 2024 | 7:04 PM

నవంబర్‌లో మరోసారి సెలబ్రిటీస్ క్రికెట్

23-07-2024 12:05:00 AM

టీసీఏ గత ఫిబ్రవరిలో నిర్వహించిన ‘సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్’ సీజన్ 1కు మంచి స్పందన రావటంతో తాజాగా సీజన్ 2కు సిద్ధమైంది. ది రాయల్ చిల్డ్ర న్స్ హాస్పిటల్ మెల్‌బోర్న్‌కు చారిటీ కోసం తెలుగు సినీ సెలబ్రిటీస్ ఈ క్రికెట్ మ్యాచ్ ఆడనున్నారు. నవంబర్‌లో జరగనున్న సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ సీజన్ 2కు సంబంధించిన సాఫ్ట్ పోస్టర్ లాంచ్ కార్యక్రమంలో ఫౌండర్ సాయికృష్ణ, తెలుగు సినీ హీరోలు శ్రీకాంత్, తరుణ్, అశ్విన్ బాబు, సుశాంత్, ఆది సాయికుమార్, సామ్రాట్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, ఆర్టిస్ట్ భూపాల్, ఓంకార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ నటుడు శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘సెలబ్రిటీ క్రికెట్ మ్యాచ్ నిర్వహించి చారిటీ ద్వారా సహాయం అందిస్తున్న సాయికృష్ణ గారికి అందరి తరపున అభినందన లు తెలియజేస్తున్నాను.

చాలా దేశాల్లో క్రికెట్ మ్యాచ్‌లు జరిగాయి. గత ఫిబ్రవరిలో సీజన్ 1 ఆడాం. ఒకే సంవత్సరంలో రెండు సీజన్లు నిర్వహించడం అంత ఈజీ కాదు. వచ్చే నవంబర్ 15, 16ల్లో జరగను న్న ఈవెంట్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని తెలిపారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడుతూ.. ‘మాకు ఉన్న స్ట్రెస్‌కి ఒక రిలీఫ్‌గా ఫీల్ అయ్యేది క్రికెట్ మ్యాచ్. ఫిబ్రవరిలో ఆస్ట్రేలియా వెళ్లి సీజన్ 1 ఆడి వచ్చాం. సీజన్ 2 కూడా అంతే సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అన్నారు. సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ ఫౌండర్ సాయికృష్ణ మాట్లాడుతూ.. ‘సెలబ్రిటీస్ అందరూ ఎంతో బిజీగా ఉన్నా చారిటీ కోసం వచ్చి క్రికెట్ ఆడి సపోర్ట్ చేస్తున్నం దుకు కృతజ్ఞతలు’ అని తెలిపారు.