calender_icon.png 6 March, 2025 | 8:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిన్నమైల్ అంజిరెడ్డి గెలుపుతో ఘనంగా సంబరాలు

06-03-2025 04:48:20 PM

భీమదేవరపల్లి (విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎమ్మెల్సీగా చిన్నమైల్ అంజిరెడ్డి గెలుపుతో హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. నరేందర్ రెడ్డి ఓటమి మంత్రి పొన్నం ప్రభాకర్ బాధ్యత వహించాలని రేపు జరగబోయేటువంటి స్థానిక ఎలక్షన్లలో కూడా ఇదేవిధంగా రిపీట్ అవుతుందని తెలియజేయడం జరిగింది. మల్కా కొమురయ్య, చిన్నమైల్ అంజిరెడ్డి లను గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలియజేయడం జరిగింది. బిజెపి అధ్యక్షులు శ్రీనివాస్, మాజీ మండల అధ్యక్షులు పైడిపెల్లి పృథ్విరాజ్ గౌడ్ మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల రక్తం తాగడమే తప్ప పేద ప్రజలకు ఏమి చేయలేనటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం విధానాలు నచ్చకనే ఉపాధ్యాయులు మేధావులు గ్రాడ్యుయేట్స్  ప్రతి ఒక్కరూ భారతీయ జనతా పార్టీ విజయాన్ని అందించారు.

హుస్నాబాద్ ఎమ్మెల్యే మంత్రి పొన్నం ప్రభాకర్ మాటల గారడితో ప్రజలను మభ్యపెడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ టార్గెట్ చేయడమే ఏకైక లక్ష్యంగా ముందుకు సాగుతు కరీంనగర్ జిల్లాలో స్థానికంగా ఇద్దరు మంత్రులుండి ఒక్క ఎమ్మెల్సీ గెలిపించుకోలేని మంత్రులు బండి సంజయ్ ని టార్గెట్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వాల్సి వస్తుందని స్థానిక సర్పంచులు, ఎంపిటిసిలు జడ్పిటిసి ఎలక్షన్లు పెట్టకుండా దాటవేస్తూ పబ్బం గడుపుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు స్థానిక ఎలక్షన్లలో కర్రు దాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు, ఉమ్మడి కరీంనగర్ అభివృద్ధి జరుగుతుంది అంటే కేవలం బండి సంజయ్ కుమార్ తప్ప రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా కేటాయించలేనటువంటి దౌర్భాగ్య పాలన కాంగ్రెస్ పాలన అని ప్రజలు వాపోతున్నారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు దొంగల కొమురయ్య, గండు సారయ్య, మాచర్ల కుమారస్వామి, ఊస కోయిల కిషన్, అంబీర్ కవిత, దొంగల వేణు, బొజ్జపురి పృధ్వీరాజ్, దొంగల రాణా ప్రతాప్, కంకల సదానందం, లక్కిరెడ్డి మల్లారెడ్డి, అయిత సాయి తేజ, బొల్లంపల్లి శ్యామ్, కాలేరు వికాస్, సింగం రాజేందర్, చొప్పరి నవీన్, గద్ద రాజేందర్, అఖిల్, సిద్ధమల్ల రమేష్, వేముల ప్రసాద్, ఆవుల శ్రీనివాస్, మొండెడ్ల ఉదయ్, తాళ్లపల్లి రవిచంద్, జనగాని కుమారస్వామి, చార్మిత, సంజయ్ తదితరులు పాల్గొన్నారు.