calender_icon.png 8 February, 2025 | 11:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భాజపా ఆధ్వర్యంలో చిట్యాలలో సంబరాలు

08-02-2025 07:48:56 PM

చిట్యాల (విజయక్రాంతి): ఢిల్లీ ప్రజలు భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడం ఎంతో సంతోషకరమైన విషయమని చిట్యాల మండల అధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఢిల్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయ దుందుభి మొగించడంతో శనివారం చిట్యాల మండల కేంద్రంలో భాజపా శ్రేణులు బాణాసంచా పేల్చి, స్వీట్లు పంపిణీ చేసి సంబరాలను నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్ కార్యకర్తలను, ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. అవినీతి అమ్ ఆద్మీ పార్టీని ఢిల్లీ ఓటర్లు వారి చీపురుతోనే ఊడ్చేశారన్నారు. కేజ్రీవాల్ అవినీతిపరుడు అని గుర్తించి ఢిల్లీ ఓటర్లు వారిని ఢిల్లీ పీఠం నుంచి దొబ్బేసి.. ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర ప్రభుత్వ విధానాలకు ఆకర్షితులై ఢిల్లీ పీఠం ఎక్కించారన్నారు.

ఇక కాంగ్రెస్ దేశంలో ప్రజలకు వ్యతిరేకంగా పోరాటాలు, ప్రజలకు అవసరం లేని మాటలు, ప్రజలు ఇక నమ్మరు అనే విషయం తేటతెల్లమైందన్నారు. ఖర్గే వ్యాఖ్యలకు దేశ ప్రజలు ఖర్గేను భస్మాసుర హస్తంగా చూశారన్నారు. ఇక ముందు దేశంలో ఎక్కడా కూడా కాంగ్రెస్ ముందుకు రాదని.. ఎవరి దేశం వాళ్లు చూసుకోవాల్సిందేనన్నారు. దేశ ప్రజలు, మన తెలంగాణ ప్రజలు కూడా అవినీతి ప్రభుత్వాలకు బుద్ధి చెప్పి..ఎట్టి పరిస్థితుల్లో అవినీతకి వ్యతిరేకంగా ఓటు వేసి.. అభివృద్ధికి పట్టం కట్టాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు ఢిల్లీ ఎన్నికలు సూచిస్తున్నాయన్నారు. ఇక మన రాష్ట్రంలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా బిజెపి విజయ దుందుభి మోగించాలని, సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పిటిసి, మున్సిపల్ కౌన్సిలర్ ఎన్నికలలో అత్యధిక సీట్లు గెలుచుకునే దిశగా ప్రయత్నం చేయాలని, సమైక్య భావనతో అందరం కలిసి పోరాడి మెజార్టీ సీట్లు సాధించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మాచర్ల రఘు, ఓబీసీ మోర్చ జిల్లా అధ్యక్షుడు తీగల జగ్గయ్య, బిజెపి సీనియర్ నాయకులు గుండ సురేష్, ఉపాధ్యక్షుడు గజనాల రవీందర్, రావుల రాకేష్ అనుప మహేష్ చింతల రాజేందర్, కేంసరపు ప్రభాకర్, పిట్టల నాగరాజు, ర్యాకం శ్రావణ్, కలవచర్ల కిషోర్, వల్లాల ప్రవీణ్, కదం రాజు, చింతకింది దశరథం, గోల్కొండ అజయ్ తదితరులు పాల్గొన్నారు.