పీసీసీ మాజీ అధ్యక్షులు వీహెచ్ డిమాండ్
హైదరాబాద్, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి): తిరుపతి లడ్డు విషయంలో వస్తున్న ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్గా తీసుకొని సీబీఐ విచారణ జరిపించాలని పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు కోరారు. శ్రీవారిని దర్శించుకోవడానికి దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా విదేశాల నుంచి సైతం భక్తులు వస్తుంటారని, వారందరూ లడ్డును తప్పక తీసుకుంటారన్నారు. అలాంటి పవిత్రమైన తిరుపతి లడ్డును అపవిత్రం చేశారనే వార్తలు రావడం భక్తుల మనోభావాలకు దెబ్బతినేలా ఉన్నాయన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకొని.. కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.