calender_icon.png 12 October, 2024 | 9:57 AM

ఇసుక టిప్పర్లు పట్టివేత

10-10-2024 12:08:51 AM

అలంపూర్, అక్టోబర్ 9: అలంపూర్ పరిధిలోని రాజోళి శివారులోని తుంగ భద్ర నది తీర ప్రాంతంలో ఇసుక తరలింపు జోరుగా సాగుతున్న విషయాన్ని ‘పగలు ఎండ్ల బండ్లు.. రాత్రి టిప్పర్లు’ శీర్షికన ఈ నెల 3న విజయక్రాంతి పత్రిక కథనాన్ని ప్రచు రించి వెలుగులోకి తీసుకుని వచ్చిం ది. జిల్లా పోలీస్ యంత్రాంగం స్పం దించి మంగళవారం రాత్రి అక్రమం గా ఇసుకను తరలిస్తున్న టిప్పర్‌ను పట్టుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేశారు. అనుమానాస్పదంగా ఉన్న మరొక టిప్పర్‌ను సైతం పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నట్లు ఎస్సై జగదీష్ తెలిపారు.