calender_icon.png 28 October, 2024 | 8:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుల గణన చేసి బీసీ రిజర్వేషన్లు పెంచాలి

30-07-2024 12:16:44 AM

అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ డిమాండ్ 

హైదరాబాద్, జూలై 29( విజయక్రాంతి) : కుల గణన చేసి బీసీ రిజర్వేషన్లు పెంచాలని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో పద్దులపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీ కార్పొరేషన్లకు ప్రభుత్వం నయా పైసా ఇవ్వదని, ఆత్మగౌరవ భవనాలు రాజధానికి 40 కిలోమీటర్ల దూరంలో కేటయిస్తోందని మండిపడ్డారు. హాస్టల్ విద్యార్థులకు కేటాయించే మెస్ బిల్లులు సరిపడా ఇవ్వకపోవడంతో నాణ్యమైన భోజనం అందడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఎంబీసీ కులాలకు కేటాయించే నిధులు కూడా ఖర్చు చేయట్లేదని, ఫీజు రీయింబర్స్‌మెంట్ పూర్తిగా ఇవ్వడం లేదని ఆరోపించారు. బీసీణి మీదనే ప్రేమ చూపి, మిగతా బీసీ కులాల విషయంలో వివక్ష చూపుతోందని ధ్వజమెత్తారు.