calender_icon.png 21 September, 2024 | 11:11 AM

రైస్‌మిల్లులపై కేసులు

21-09-2024 12:25:42 AM

వనపర్తి , సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): రెండు రైస్ మిల్లులపై ఆకస్మిక దాడులు నిర్వహించిన సివి ల్ సప్లు అధికారులు కేసులు నమో దు చేసిన ఘటన శుక్రవారం రాత్రి  చోటు చేసుకుంది. వరిధాన్యాన్ని బి య్యంగా ఆడించి ఎఫ్‌సీఐకి అప్పగిం చాల్సి ఉంది. కాని నిర్దేశించిన గడు వు సమీపిస్తున్న నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శుక్రవార ం హైదరాబాద్ నుంచి విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం ఆధ్వర్యం లో డీటీ వేణు వీపనగండ్ల మండలం గోపాల్‌రెడ్డి ఇండస్ట్రీ, వనపర్తి మండ లం నాచహళ్లి శివారులోని రిలిక్స్ ఇ ండస్ట్రీటీలో దాడులు నిర్వహించా రు. గోపాల్‌రెడ్డి ఇండస్ట్రీలో 62 వేల బస్తాలు, రిలిక్స్ ఇండస్ట్రీటీలో 80 వే ల బస్తాలు మాయమైననట్లు గుర్తించారు. ఆయా రైస్ మిల్లులపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.