ముంబై, అక్టోబర్ 1: ముస్లింలను, మహమ్మద్ ప్రవక్తను కించపర్చేలా మాట్లాడిన మహారాష్ట్రకు చెందిన మహంత్ రామ్గిరి మహరాజ్పై రాష్ట్రవ్యాప్తంగా వివిధ పోలీస్ట్ స్టేషన్లలో 67 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని బాం బే హైకోర్టుకు మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
మహమ్మద్ ప్రవక్తను కించర్చిన రామ్గిరి మహరాజ్తో వేదిక పంచుకొన్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేపై కూడా కేసు నమోదుచేయాలని న్యాయవాది మహ్మద్ వాసీ దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ రేవతి మోహితే దెరె, జస్టిస్ పృథ్విరాజ్ చౌహాన్తో కూడిన ధర్మాసనం విచారించింది.
రామ్గిరి మహరాజ్తో వేదిక పంచుకొన్నంత మాత్రాన సీఎంపై కేసు నమోదుచేయాలని కోరటంలో అర్ధం లేదని పిటిషనర్పై ఆగ్రహం వ్యక్తంచేసింది. రామ్గిరిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ప్రతివాదులుగా చేర్చితే సరిపోతుందని పేర్కొన్నది.