24 May, 2026 | 2:29 PM

Breaking News

140 కోట్ల భారతీయుల ప్రయోజనాలే మాకు ముఖ్యం: విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌   •   అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం సమీపంలో కాల్పులు.. నిందితుడు మతి   •   పేదలకు అండగా ప్రజా ప్రభుత్వం.. గోపాలరావుపల్లెలో సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ   •   ఘనంగా మేడ్చల్ –మల్కాజిగిరి జిల్లా 2వ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ – 2026   •   మండలంలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్   •   విద్యతోనే విద్యార్థులకు భవిష్యత్తు   •   పంట వ్యర్థాల దగ్ధంతో ఆందోళనలో పల్లె ప్రజలు   •   శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు   •   కోదాడ సమీపంలో రోడ్డు ప్రమాదం: ఆరుగురికి గాయాలు   •   నీలోఫర్ కేఫ్ పరిధిలో రెచ్చిపోయిన ఆకతాయిలు   •  

కరీంనగర్ జిల్లాలో శిశు విక్రయం కలకలం.. 15 మందిపై కేసు నమోదు

22-11-2025 09:29 AM

హైదరాబాద్: కరీంనగర్ జిల్లాలో(Karimnagar District) శిశువు విక్రయం కలకలం రేగింది. కరీంనగర్ టూటౌన్ పోలీస్ స్టేషన్( Karimnagar Two Town PS)లో మగ విశువు విక్రయంపై కేసు నమోదైంది. మొత్తం 15 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఏడు రోజుల శిశువును రూ. రూ.9 లక్షలకు విక్రయానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. బాలల పరిరక్షణ కమిటీ సభ్యులకు ఓ వ్యక్తి సమాచారం ఇవ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ చెందిన యువతి ప్రేమించి మోసపోవడంతో గర్భవతిగా మారింది. అనంతరం కొంతమంది దళారులను ఆశ్రయించింది. మధ్యవర్తుల సాయంతో శిశువు పుట్టగానే కరీంనగర్ జిల్లాకు చెందిన దంపతులకు విక్రయించారు. ఈ ఘటపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు శిశువును అమ్మిన, కొన్న వారిపై కేసులు నమోదు చేశారు. శిశువును స్థానికంగా ఉన్న మాతాశిశు కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిందితులను శనివారం నాడు కోర్టులో హాజరు పరిచే అవకాశముందని అధికారులు తెలిపారు.