calender_icon.png 29 September, 2024 | 4:55 PM

హైడ్రా కమిషనర్‌పై మానవ హక్కుల కమిషన్‌లో కేసు

29-09-2024 12:30:59 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): హైడ్రా క మిషనర్ ఏవీ రంగనాథ్‌పై రాష్ట్ర మా నవ హక్కుల కమిషన్(హెచ్‌ఆర్సీ)లో కేసు నమోదైంది. హైడ్రా అధికారులు ఇల్లు కూల్చేస్తారేమోనని భయబ్రాంతులకు గురై గుర్రం బుచ్చమ్మ అనే మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తల్లో వచ్చిన విషయం తెలిసిందే. ఇదే విషయమై ఆమె కుటుంబసభ్యులు హెచ్‌ఆర్సీ లో హైడ్రా కమిషనర్‌పై ఫిర్యాదు చేశారు.

దీంతో 16063/IN/2024 కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టనున్నట్లు మానవ హక్కుల కమిషన్ తెలిపింది. కాగా ఇప్పటికే బుచ్చమ్మ ఆత్మహత్యపై రంగనాథ్ స్పందించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైడ్రా ఎవరికి ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని, బుచ్చమ్మ ఇళ్లు ఎఫ్‌టీఎల్ పరి ధికి దూరంగా ఉందన్నారు.

కూల్చివేతల్లో భాగంగా తమ ఇళ్లను కూలు స్తారనే భయంతోనే ఆమె కూతుర్లు బుచ్చమ్మను ప్రశ్నించారన్నారు. దీంతో మనస్తాపానికి గురైన బుచ్చ మ్మ ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పా రు.

ఈ ఘటనతో హైడ్రాకు సంబం ధం లేదని, హైడ్రా గురించి మీడియాలో గానీ, సామాజిక మాధ్య మాల్లో గానీ భయాలు పుట్టించొద్దని కోరుతున్నాన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న కూల్చివేతలను హైడ్రాకు ఆపాదిస్తున్నారని, హైడ్రా కూల్చివేతల గురించి అనవసరమైన భయా లు వద్దని రంగనాథ్ పేర్కొన్నారు.