హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): నగరంలో ఈ నెల 19న నిర్వహించిన మిలాద్ ఉన్ నబీ ర్యాలీలో ఓ వ్యక్తిపై దాడికి పాల్పడిన కేసులో 14 మందిపై కేసు నమోదు చేశారు మంగళ్హట్ పోలీసులు. జుమ్మేరాత్ బజార్కు చెందిన సూరజ్ సింగ్ (39) మల్లెపల్లిలో ప్రింటింగ్ ప్రెస్ నిర్వహిస్తున్నాడు. తాను ఇంటి నుంచి కార్యాలయానికి వెళ్లే క్రమంలో మిలాద్ ఉన్ నబీ ర్యాలీ జరుగుతోంది. దీంతో సూరజ్సింగ్ వాళ్లని పక్కకు జరిగి దారి ఇవ్వాలని కోరగా, తీవ్ర కోపోద్రిక్తులైన కొందరు యువకులు అతడిపై దాడికి పాల్పడ్డారు. ఇది చూసిన మహేందర్ సింగ్ అనే వ్యక్తి గొడవను ఆపడానికి ప్రయత్నించాడు.
కానీ, ఆ యువకులు సూరజ్సింగ్తో పాటు మహేందర్ సింగ్పై కూడా దాడి చేసి గాయపరిచారు. దీంతో సూరజ్ సింగ్ మంగళ్హట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దాడికి పాల్పడిన షేక్ ఆమేర్, సీసీఎల్ మహమ్మద్ ఆదిల్ అలామ్, అద్నాన్ బేగ్, మహమ్మద్ ఫయాజ్, మీర్ అబ్రార్ అలీ ఖాన్, మహ్మద్ ఉస్మాన్, మహమ్మద్ అబ్దుల్ రజాక్, యూసు ఫ్ నమీర్ ఖాన్, మహమ్మద్ రెహన్ను శనివారం అరెస్ట్ చేశారు. మరో ఐదుగురు పరారీలో ఉన్నారని వెల్లడించారు.