calender_icon.png 10 October, 2024 | 8:56 PM

ఐదుగురు రిపోర్టర్లపై కేసు

10-10-2024 12:31:40 AM

చేవెళ్ల, అక్టోబర్ 9: దసరా పండుగకు మామూళ్లు ఇవ్వాలని ఓ ఆసుపత్రి యాజమాన్యాన్ని బెదిరించిన ఐదుగురు రిపోర్టర్లపై శంకర్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సీఐ శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం.. శంకర్‌పల్లికి చెందిన డిజిటల్ పేపర్ రిపోర్టర్లున సాయికిరణ్‌రెడ్డి (నమస్తే జ్యోతి), మల్లేశ్ గౌడ్ (నేటి ప్రస్థానం), ప్రతాప్ (జ్యోతి), సుధాకర్ గౌడ్ (సూర్య వెలుగు), రాజేశ్ (మనసాక్షి) మంగళవారం హైదరాబాద్ రోడ్డులోని ఓ దవాఖానకు వెళ్లారు.

పండుగకు రూ.10 వేలు ఇవ్వాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. ఇవ్వమని చెప్పడంతో బెదిరింపులకు దిగారు. దీంతో యాజమాన్యం బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఐదుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.