calender_icon.png 1 October, 2024 | 5:49 AM

ధాన్యం నిల్వలపై తనిఖీలు చేయండి

01-10-2024 12:06:33 AM

వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి 

వనపర్తి, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): సీఎంఆర్ బియ్యం సేకరణ  వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం మధ్యాహ్నం తన ఛాంబర్‌లో పౌరసరఫరాల శాఖ అధికారులతో సీఎంఆ ర్ సేకరణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. మిల్లర్ల నుంచి రోజువారీ గా సేకరించాల్సిన బియ్యం సేకరించపోవడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

బియ్యం ఇవ్వని రైస్ మిల్లు ల్లో తనిఖీ చేయాలని, ఖరీప్ సీజన్ లో ఇచ్చిన వడ్లు వాస్తవంగా ఉన్నా యా లేవా అనేది తేల్చి, సరిగ్గా నిల్వ లు లేకుంటే కేసులు నమోదు ఆదేశించారు. రైస్ మిల్లుల తనిఖీ రెండు రోజుల్లో పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని సివిల్ సప్లు డీటీలను హెచ్చరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నగేష్, జిల్లా సివిల్ సప్లు అధికారి కాశీవిశ్వనాథ్, జిల్లా వ్యవసాయ అధికారి గోవిందనాయక్, మార్కెటింగ్ అధికారి స్వరణ్ సింగ్ పాల్గొన్నారు.