calender_icon.png 18 October, 2024 | 2:20 PM

సారపాకలో కార్డెన్ సెర్చ్...

18-10-2024 11:28:14 AM

బూర్గంపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలోని గాంధీనగర్ లో శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. పాల్వంచ డిఎస్పీ సతీష్ కుమార్, సీఐ వినయ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు ఐదు బృందాలుగా గాంధీనగర్ లోని ప్రతి ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ.. మత్తు పదార్థాలకు ఎవరూ బానిస కావొద్దని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనుమానిత వ్యక్తులు కనబడితే డయల్ 100 లేదా పోలీస్ స్టేషన్ వద్ద సమాచారం ఇవ్వండని, సమాచారం ఇచ్చిన వారు వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.

సరైన డాక్యుమెంట్స్ లేని వాహనాలను కొనుగోలు చేయవద్దని, సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కొనుగోలు చేసేవారు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పలు వాహనాలను అదుపులోకి తీసుకొని బూర్గంపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ కార్యక్రమంలో బూర్గంపాడు ఎస్సైలు రాజేష్, ఏసోబు, పాల్వంచ ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్డెన్ సెర్చ్ లో బూర్గంపాడు ఎస్ఐ రాజేష్, టాస్క్ ఫోర్స్ సిఐ రమాకాంత్, ఎస్ఐ ప్రవీణ్, కొత్తగూడెం వన్ టౌన్ ఎస్ఐ విజయ, ములకలపల్లి ఎస్ఐ రాజశేఖర్, పాల్వంచ రూరల్ ఎస్ఐ సురేష్, డాగ్ స్క్యాడ్ అధికారులు, ఏఎస్ఐలు మరియు మహిళ ఏఎస్ఐలు కానిస్టేబుల్స్ సుమారు 70 మంది పోలీస్ సిబ్బంది  పాల్గొన్నారు.