సీఐ ప్రవీణ్ కుమార్...
పెద్దపల్లి (విజయక్రాంతి): ప్రజలు గంజాయి నిషేధిత గుట్కాల రవాణాపై అప్రమత్తంగా ఉండాలని పెద్దపల్లి పట్టణంలో కార్డెన్ సర్చ్ లో సీఐ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. పెద్దపల్లి పట్టణంలోని ఫారెన్ స్ట్రీట్ భారత్ నగర్ శివాలయం వీధిలో పెద్దపల్లి సిఐ నేతృత్వంలో వార్డుల్లో కార్డెన్ సర్చ్ నిర్వహించారు. ధ్రువీకరణ పత్రాలు లేని ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ... ప్రజలు గంజాయి, నిషేధిత గుట్కాల రవాణాపై సరఫరాపై అప్రమత్తంగా ఉండాలని, గుర్తుతెలియని వ్యక్తులకు ఇండ్లు కిరాయికి ఇవ్వరాదని, యువత చెడు మార్గాలను వీటి తల్లిదండ్రులు చెప్పిన మాటలు విడాలని తెలిపారు. ఆయన వెంట ఎస్సైలు లక్ష్మణరావు, మల్లేష్ సిబ్బంది పాల్గొన్నారు.