calender_icon.png 27 September, 2024 | 4:46 AM

వాగులో కొట్టుకుపోయిన కారు..

09-09-2024 03:17:23 AM

  1. డయల్ 100కు ఫోన్ చేసి ఆర్తనాదాలు 
  2. 9 మందిని కాపాడిన యువకులు, పోలీసులు 

నాగర్‌కర్నూల్, సెప్టెంబర్ 8 (విజయ క్రాంతి): దుందుభి వాగును దాటుతున్న కారు వరద ఉధృతికి వాగులో కొట్టుకుపోయింది. అందులో ఉన్న తొమ్మిది మందిని పోలీసులు రక్షించారు. మహబూ బ్‌నగర్ జి ల్లా జడ్చర్ల మండలం చిన్న ఆది రాల గ్రామా నికి చెందిన గోవిందు, బిచ్చ, రవి, రాజేంద్ర ప్రసాద్, శ్రీకాంత్, సంజన, కార్తీక్, సంతోష్ మొత్తం 9 మంది కొల్లా పూర్ మండలం సో మశిలకు వెళ్లారు.

ఆదివారం రాత్రి స్వగ్రా మానికి కారులో వెళ్తున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా తాడూర్ మండలం సిర్సవాడ గ్రామం మీదుగా దుందుభి వాగును దాటే ప్రయ త్నం చేశారు. మధ్యలోకి వెళ్లగానే వరద ఉధృతి పెరగడంతో కారు కొట్టుకుపోయిం ది. వెంటనే డయల్ 100 ద్వారా పోలీసులను ఆశ్రయించారు. వెంటనే స్పందించి తాడూర్ పోలీసులు సిర్సవాడ గ్రామ యువతను అప్రమత్తం చేశారు. యువకులు వెంటనే ట్రాక్టర్ సాయంతో కారును, అందులో ప్రయాణిస్తున్న వారిని రక్షించారు.