19-02-2025 01:12:38 AM
తిరుమలగిరి, ఫిబ్రవరి 18 : తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రం సమీపంలోని ఇటుకల బట్టిల దగ్గర ఉదయం 10: 00 గంటల సమయంలో గుంటూరు నుండి కరీంనగర్ వెళ్తున్న మారుతి ఈకో కారు అదుపుతప్పి బోల్తా కొట్టింది.
ఈ ఘటనలో డ్రైవర్ కు గాయాల య్యాయని. ప్రమాదం జరిగినప్పుడు కారులో ఇద్దరు మహిళలు ఇద్దరు పురుషులు ఉన్నారని ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని సంఘటన స్థలంలో ఉన్న స్థానికులు తెలిపారు గాయాలపాలైన డ్రైవర్ని 108 వాహనంలో సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించినట్టు వారు తెలిపారు