calender_icon.png 27 October, 2024 | 8:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లారీని ఢీ కొట్టిన కారు.. ఇద్దరు మృతి

28-08-2024 10:54:52 AM

నిజామాబాద్,(విజయక్రాంతి): ఆగి ఉన్న లారీని కారు అతివేగంగా ఢీకొట్టిన సంఘటనలో ఇద్దరు యువకులు మృతిచెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. నిజామాబాద్ రూరల్ సిఐ సురేష్ తెలిపిన ప్రకారం... బుధవారం మాక్లూర్ మండలం చికిలి గ్రామానికి చెందిన వంశీని తన గ్రామంలో వదిలిపెట్టేందుకు కారులో వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. వంశీని అతని స్నేహితుడు రాజేష్, డ్రైవర్ ఆకాష్ తో కలిసి వెళ్తుండగా నిజామాబాద్ రూరల్ మండలం శ్రీనగర్ వద్ద ఆగి ఉన్న లారీని కారు బలంగా ఢీ కొట్టింది.

దీంతో కారు టాప్ ఊడిపోగా వంశీ, రాజేష్ అక్కడికక్కడ మృతి చెందారు, డ్రైవర్ ఆకాష్ తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుని చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకొని నిజాంబాద్ రూరల్ పోలీసులు మృతదేహాలను కారు నుండి బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. 

శ్రీనగర్ వద్ద తరచూ లారీలను ఆపుతుండడంతో వాహన ప్రమాదాలు జరుగుతున్నాయని, లారీ చెడిపోవడంతోటే ఈ సంఘటన జరిగిందని మృతుని బంధువులు ఆందోళన దిగారు, రైస్ మిల్లు యాజమాన్యం మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.