04-03-2025 02:14:36 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 3 (విజయక్రాంతి): నగరంలోని ఎన్టీఆర్ ఘాట్ సమీపంలో ఆదివారం అర్ధరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. ఖైరతాబాద్ జంక్షన్ నుంచి సెక్రటేరియట్ వైపు వెళ్తున్న కారు వేగంగా వచ్చి ఎన్టీఆర్ ఘాట్ మూల మలుపు వద్ద డివైడర్ను ఢీకొని ఫుట్పాత్పైకి దూసుకెళ్లింది.
ఓ విద్యుత్ స్తంభంతో పాటు చెట్లను ఢీకొట్టడంతో అవి ధ్వంసమయ్యాయి. ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. కారులో ఎయిర్బెలూన్లు తెరుచుకోవడంతో కారులోని వారికి ప్రమాదం తప్పిందని తెలుస్తోంది. కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్న కారణంగా ప్రమాదం జరిగినట్టు తెలుస్తున్నది.