calender_icon.png 24 September, 2024 | 12:59 AM

మేకప్ చైర్‌లో ఎక్కువసేపు కూర్చోలేను

21-09-2024 12:40:00 AM

రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్’లో సీత పాత్రలో నటించడం ద్వారా తెలుగు ప్రేక్షకులను పలుకరించింది బాలీవుడ్ నటి అలియా భట్. ఈ చిత్రంలో అలియా పాత్ర నిడివి తక్కువగా ఉన్నప్పటికీ చక్కటి కట్టూబొట్టులో తెలుగందంతో పల్లెటూరి యువతిగా ఆకర్షించింది. తాజాగా ఆమె నటించిన హిందీ చిత్రం ‘జిగ్రా’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా అక్టోబర్ 10న విడుదల కానున్న నేపథ్యంలో చిత్రబృందం ప్రచార కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఈవెంట్లు, ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న అలియా పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ‘నేను తల్లి అయిన తర్వాత టైమ్ మేనేజ్‌మెంట్ సాధ్యం కావడంలేదు.

2022 నవంబర్‌లో నా కూతురు రాహాకు జన్మనిచ్చిన తర్వాత నాకంటూ సమయం వెచ్చించలేకపోతున్నా. మాతృత్వం ఆనందంగానే ఉన్నా, కొద్దిపాటి ఆందోళన కూడా ఉంది’ అని తెలిపింది. తనకున్న ఓ సమస్యను కూడా అలియా ఈ సందర్భంగా వివరించింది. “నేను ఒకేచోట ఎక్కువ సేపు కూర్చోలేను. ఎందుకంటే నాకు అటెన్షన్ డెఫిసిట్ డిజార్డర్ (ఏడీడీ) సమస్య ఉంది. ఈ కారణంగా నేను మేకప్ చైర్‌లో 45 నిమిషాల కంటే ఎక్కువ సేపు కూర్చోలేను. అందుకే ఈ సమస్య గురించి ఆర్టిస్టులకు ముందే చెప్పి వీలైనంత త్వరగా మేకప్ పూర్తి చేయాలని సూచిస్తుంటా” అని చెప్పుకొచ్చింది.