calender_icon.png 14 October, 2024 | 11:47 AM

అలయ్ బలయ్‌కి రాలేను

14-10-2024 03:24:17 AM

సాయిబాబా మృతికి కేంద్రమే కారణం 

సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ

హైదరాబాద్, అక్టోబర్ 13 (విజయక్రాం తి): ప్రొఫెసర్ సాయిబాబా అకాల మృతికి నిరసనగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ నిర్వహించే అలయ్ బలయ్‌కి ఈసారి మాత్రం తాను హాజరు కావ డం లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ తెలిపారు. తన రాజకీయ అనుబంధంతో సంబంధం లేకుండా ప్రతీ సంవత్సరం తనను ఆహ్వానిస్తున్న అలయ్ బలయ్ కార్యక్రమానికి హాజరు కాలేనందుకు క్షమిం చాలన్నారు. 

దివ్యాంగుడైన ప్రొఫెసర్ సాయిబాబాను అక్రమంగా అరెస్టు చేసిన కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అలాంటి ప్రభుత్వంలో ఉన్న బండా రు దత్తాత్రేయ ఆహ్వానాన్ని మన్నించి తాను అలయ్ బలయ్ కార్యక్రమానికి వెళ్లలేనని, నిరసన వ్యక్తం చేస్తున్నాని తెలిపారు.

కేంద్రం అక్రమంగా అరెస్టు చేసినా పదేండ్ల తర్వాత కోర్టు నిర్దోషిగా ప్రకటించిందని, కానీ సాయిబా బా విషయంలో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందన్నారు. ఆయన ప్రాణాలు పోయేందుకు కారణమైన కేంద్ర ప్రభుత్వంలో ఉన్న దత్తాత్రేయ నిర్వహిస్తున్న కార్యక్రమానికి తాను రాలేనని ఆయన తెలిపారు.