హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 25 (విజయక్రాంతి): బాలానగర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జగద్గిరిగుట్టలో గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయనే సమాచారం మేరకు ఎస్టీఎఫ్ టీమ్ లీడర్ సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇద్దరు యువకుల బైక్లను తనిఖీ చేయగా, 1.3 కిలోల గంజాయి పట్టుబడింది. నిందితులు ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన పాలమూరి రాహుల్ సుందర్, సెట్లం సాయిగౌతమ్ను అరెస్ట్ చేశారు.