calender_icon.png 11 October, 2024 | 3:58 AM

గంజాయి విక్రేతల అరెస్ట్

11-10-2024 01:53:37 AM

బెల్లంపల్లి, అక్టోబర్ 10 (విజయక్రాంతి): ఈస్‌గాం గ్రామశివారులో గంజాయి విక్రయిస్తున్న ఐదుగురు వ్యక్తులను మాదారం పోలీసులు అరెస్ట్ చేశారు.  తాండూర్ సర్కిల్ పరిధిలోని ఈస్‌గాంలో గురువారం కొందరు గంజ యి విక్రయిస్తున్నారని సమాచారం అందుకున్న పోలీసులు ఆ ప్రాంతం లో దాడులు నిర్వహించా రు. నిందితు లు షేక్ హసం (తాండూర్), గొల్లపల్లి సందీప్ (తంగళ్లపల్లి), బండారి శ్యామ్ (తాండూర్), విజయ్ హల్దార్ (ఈస్ గాం), రాజ్‌కుమార్ సర్కార్ (ఈస్‌గాం)ను అదుపు లోకి తీసుకున్నారు. వారి నుంచి 1.1 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.