మిర్యాల గూడ: నల్గొండ జిల్లాలోని మిర్యాల గూడ మండలంలో గంజాయి కలకలం రేపుతోంది. అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ముఠా సభ్యుడిని మిర్యాలగూడ వన్ టౌన్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. మరో నలుగురు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితుల వద్ద నుంచి 140 కిలోల గంజాయి, రెండు కార్లు, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు 35 లక్షలు ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు.