20-02-2025 02:25:50 PM
2 కార్లు సీజ్, ఆరుగురు నిందితులపై కేసు నమోదు..
నలుగురు నిందితుల అరెస్ట్, పరారిలో ఇద్దరు..
పట్టుకున్న గంజాయి విలువ రు. 48,38,500.
రామగుండం పోలీస్ కమీషనరేట్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో సీపీ శ్రీనివాస్
రామగుండం,(విజయక్రాంతి): రామగుండము సీపీ శ్రీనివాస్ ఆదేశాల మేరకు పెద్దపల్లి డీసీపీ చేతన ఆద్వర్యంలో గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్ పర్యవేక్షణ లో గుట్టు గా తరలిస్తున్న గంజాయి ముఠాను నిన్న గోదావరిఖని టూ టౌన్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. గోదావరిఖని- 11A గని క్రాస్ రోడ్డు వద్ద వాహనాల తనిఖి చేస్తుండగా 2 కార్లలో తరలిస్తున్న 96.770 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకుని రెండు వాహనాలు సీజ్ చేసి, ఆరుగురు నిందితులపై కేసు నమోదు చేసినట్లు సీపీ శ్రీనివాస్ తెలిపారు. పట్టుబడిన వారిలో యూపీ రాష్ట్రంకు చెందిన
ఉదయ్, రాజస్థాన్ కు చెందిన రాజ్ లోథి సంజు, ఒడిస్సా కు చెందిన కేశవ్ ఖరా, సోమంత ఖోరా ఉన్నారు. కాగా, నిందితుల్లో చత్తీస్గడ్ రాష్ట్రం కు చెందిన సూరజ్ (వెర్నాకారు యజమాని) పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితుల వద్ద నుంచి 96.770 కిలోల గంజాయి, 2 కార్లు, 6 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోనీ జగదల్పూర్ నుండి మంథని మీదుగా మహరాష్ట్రకు తరలిస్తున్న క్రమంలో పక్కాసమాచారం మేరకు 11A మైన్ క్రాస్ వద్ద వాహనాల తనిఖీలో పట్టుకున్నట్లు చెప్పారు. పట్టుబడిన 96.770 కిలోల గంజాయి విలువ రు. 48,38,000. ఉంటుందని తెలిపారు. సీపీ మాట్లాడుతూ గంజాయి రహిత కమీషనరేట్ గా మార్చడానికి రామగుండం కమీషనరేట్ పోలీస్ విన్నూత కార్యక్రమలు చేపడుతూ ప్రజల్లో చైతన్యం కల్పిస్తూ, అవగాహన కల్పించడం జరుగుతుందని, కమీషనరేట్ పరిధిలో గంజాయి అక్రమ రవాణాపై స్పెషల్ డ్రైవ్ లు, నార్కోటిక్ జగిలాలతో తనిఖీలు చేపడుతూ గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపడం జరుగుతుదన్నారు.
గంజాయి అక్రమ రవాణాపై ,గతంలో గంజాయి కేసులలో నిందుతులుగా ఉన్నవారిపై నిఘా ఉంచి గంజాయి కిట్ల సహాయంతో యూరిన్ టెస్ట్ లు నిర్వహించి గంజాయి సేవించే వారిని వారికి గంజాయి అందించే వారిని గుర్తించి కేసులు నమోదు చేస్తున్నామన్నారు. ఎక్కడైనా గంజాయిని పండించినా/ అమ్మినా అక్రమంగా రవాణా చేస్తున్నా తమకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేసారు. యువకులు గంజాయి వంటి మాదక ద్రవ్యాలకు బానిసై తమ విలువైన భవిష్యత్తును పాడు చేసుకోవడంతో పాటుగా తమ కుటుంబాలను మొత్తం ఇబ్బందులలోకి నేట్టేస్తున్నారని అంతేకాక గంజాయి మత్తులో, డబ్బుల కోసం నేరాలు చేయడానికి సైతం వెనకాడరని తెలిపారు. ఇలా జరగకుండా ఉండాలంటే గంజాయి అనే మహమ్మారిని మనం అందరం కలిసి అంతం చేయాలని గంజాయి రహిత కమీషనరేట్ నిర్మాణం లో అందరు భాగస్వాములు కావాలని ప్రజలకు విజ్ఞప్తి చేసారు. ఈ ముఠా ను పట్టుకోవడం లో చాకచక్యంగా వ్యవహరించి న స్పెషల్ బ్రాంచ్ రామగుండం, టాస్క్ ఫోర్స్ రామగుండం, గోదావరిఖని టూ టౌన్ పోలీసు సిబ్బందినీ పోలీస్ కమీషనర్ అభినందించారు.