హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి) : ధూల్పేట్లోని జుమ్మెరాత్బజార్లో ఆదివారం గంజాయి విక్రయిస్తున్న ముఠాను ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిలో ముఖేష్ సింగ్, లడ్డు సింగ్, సాగర్ సింగ్, వైష్ణవి సింగ్ ఉన్నారు. రూ.80 వేలు విలువచేసే 1.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని.. నిందితులను కోర్టులో హాజపరిచామని ఎక్సైజ్ సీఐ మధుబాబు తెలిపారు.