రాజేంద్రనగర్,(విజయక్రాంతి): మణికొండ మున్సిపల్ పరిధిలో గంజాయి బ్యాచ్ హల్ చల్ చేసింది. పుప్పాలగూడలో అనంత పద్మనాభ స్వామి ఆలయం ప్రాంగణంలో థార్ కార్ లో గంజాయి సేవిస్తున్న ఐదు మంది యువకులను నార్సింగి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆలయం ప్రాంగణంలో మద్యం సేవించకూడదని స్థానికులు చెప్పడంతో గొడవకు దిగిన గంజాయి బ్యాచ్ హల్ చల్ చేసింది. గంజాయి బ్యాచ్ కి స్థానికులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. గంజాయి మత్తులో స్థానికులను సదరు యువకులు చితకబాదారు. వాగ్వాదంలో గంజాయి బ్యాచ్ ని పట్టుకొని స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. రంగంలోకి దిగిన పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.