23-04-2025 08:06:10 PM
నస్పూర్ (విజయక్రాంతి): జమ్మూకాశ్మిర్ లోని పహల్గామ్లో ఉగ్రదాడి వెనుక పాక్ లాస్కరే సంస్థ హస్తం ఉన్నదని, ఆ దాడిలో చనిపోయిన వారికి మాజీ సర్పంచ్ మల్లెతుల రాజేంద్రపాణి ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి నివాళులు అర్పించారు. ఉగ్రవాదుల దాడి దేశద్రోహుల చర్య అని, పాకిస్తాన్ పిరికిపందల చర్యగా ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యువకులు సందనవేణి శ్రవణ్, రాజు, క్రాంతి, అఖిల్, శ్రీనివాస్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.