న్యూఢిల్లీ, అక్టోబర్ 16: దేశంలోని అత్యంత ప్రముఖుల (వీవీఐ పీ)కు భద్రత కల్పించే విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొన్నది. వచ్చే రెండు నెలల్లో 9 మంది ప్రముఖులకు ఎన్ఎస్జీ భద్రతను ఉపసంహరించనున్నట్లు ప్రక టించింది. వీరిలో ఏపీ సీఎం చంద్రబాబు, యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్, రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ కూడా ఉన్నారు. వీరికి ఎన్ఎస్జీ స్థానంలో సీఆర్పీఎఫ్తో భద్రత కల్పిస్తారు.
స్పెషల్ ఆపరేషన్స్ నిర్వహిం చటంలో నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్ఎస్జీ)కి తిరుగులేని రికార్డు ఉన్నది. ఈ సంస్థ చేపట్టిన ఏ ఒక్క ఆపరేషన్ కూడా ఇప్పటివరకు విఫలం కాలేదు. అయితే, ప్రముఖుల భద్రత నుంచి ఈ సంస్థను ప్రత్యేక ఆపరేషన్లకే పరిమితం చేయాలని కేంద్రం నిర్ణయించింది.