calender_icon.png 21 October, 2024 | 12:02 PM

నిజాయతీతో ఎక్కడైనా రాణించవచ్చు

21-10-2024 12:12:27 AM

* న్యాయాధికారి మంజూల

పెద్దపలి, అక్టోబర్ 20 (విజయక్రాంతి): క్రమశిక్షణ, నిజాయతీతో పనిచేస్తే ఏ రంగంలోనైనా రాణించవచ్చని గోదావరిఖని కోర్టు నుంచి పెద్దపల్లికి బదిలీపై వెళ్తున్న ప్రిన్సిపల్ సివిల్ న్యాయాధికారి మంజూల అన్నారు. ఆదివారం కోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆమె మాట్లాడారు.

అనంతరం ఆమెను బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మానించారు. కార్యక్రమంలో ఏసీపీ రమేష్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తౌటం సతీష్, ప్రధాన కార్యదర్శి జవ్వాజి శ్రీనివాస్, సుల్తాన్‌బాద్ జూనియర్ సివిల్ న్యాయాధికారి గుర్గం గణేష్, ఏజీపీ కిషన్‌రావు పాల్గొన్నారు.