27-03-2025 12:00:00 AM
టేకులపల్లి, మార్చి 26 (విజయక్రాంతి): టేకులపల్లిలోని మహాత్మా గాంధీ జ్యోతిబా పూలే బాలుర హాస్టల్ లో మండల వైద్యాధికారి డాక్టర్ కందుల దినేష్ నేతృత్వంలోని వైద్య బృందం బుధవారం వైద్య శిబిరం నిర్వహించారు. పిల్లలకు ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వచ్చే వ్యాధులు పరీక్షల సమయంలో తీసుకోవాల్సిన పోషకాహారంపై క్షయ,కుష్టు వంటి అంటూ వ్యాధులపై చర్మవ్యాధులపై అవగాహన కల్పించారు.
పరీక్షల సమయంలో ఒత్తిడి ఆందోళనలకు దూరంగా ప్రశాంతంగా ఉండాలని ఎక్కువ మంచినీరు తీసుకోవాలని ఎక్కువ శక్తినిచ్చే ఆహార పదార్థాలైన ప్రోటీన్లు కలిగిన గుడ్డు, పప్పులు, పెరుగు, పాల ఉత్పత్తులు తీసుకోవాలని తగినంత నిద్ర పరీక్షలు విజయవంతంగా ముగించడానికి ఉపయోగపడతాయని అలాగే వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం ఆరోగ్యకరమని పిల్లలకు సూచించారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రవీందర్, ఆరోగ్య విస్తరణ అధికారి దేవా, స్టాఫ్ నర్స్ రేష్మ, ఏఎన్ఎం సులోచన, చంద్రకళ, మజహరి, సుజాత, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.