17-12-2024 01:20:27 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 16 (విజయక్రాంతి): సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలతో ప్రజల్ని మోసం చేస్తున్నారు. తాజాగా టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ ఫారుఖీ పేరుతో సైబర్ నేరగాళ్లు కాల్స్ చేస్తున్నారంటూ ఆయన దృష్టికి వచ్చింది. దీంతో ఇలాంటి ఫేక్ కాల్స్ను నమ్మొదని ఉద్యోగులు, ప్రజలకు విద్యుత్ శాఖ విజ్ఞప్తి చేసింది.