17-04-2025 12:00:00 AM
ఎస్పీ డీవీ శ్రీనివాసరావు
కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్16( విజ యక్రాంతి): ప్రజల దాహార్తి తీర్చేందుకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపడుతున్నట్లు ఎస్పి డీవీ శ్రీనివాసరావు తెలిపారు. బుధవా రం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని అదనపు ఎస్పీ ప్రభాకర్ రావు, ఏఎస్పి చిత్తారంజన్ తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వివిధ ప్రాంతాల నుండి జిల్లా కేంద్రానికి వచ్చే ప్రజలకు వేసవి దృష్ట్యా పోలీసులు ‘నీకోసం’ కార్యక్రమంలో భాగంగా మజ్జిగ పంపిణీ చేపట్టడం జరుగుతుందన్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా మం డల కేంద్రాల్లో రద్దీ ప్రాంతాలలో చలివేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు.
ప్రస్తు తం జిల్లా కేంద్రంలో మాత్రమే మజ్జిగ పంపి ణీ ఎండలు తగ్గేవరకు ప్రజలకు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్, వాంకిడి సిఐలు రవీందర్, సత్యనారాయణ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.