calender_icon.png 19 October, 2024 | 7:07 AM

సమయానికి బస్సులు నడపాలి

19-10-2024 12:30:24 AM

ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థుల రాస్తారోకో

రామాయంపేట, అక్టోబర్ 18: సమయానికి బస్సులు నడపకపోవడం వల్ల పాఠశాలలకు, కళాశాలలకు టైమ్‌కు వెళ్లలేకపోతున్నామని, బస్సులను సమయానికి నడపాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం రామాయంపేట రహదారిపై ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రశాంత్ మాట్లాడుతూ.. ఖాజాపూర్, ఝాన్సిలింగాపూర్ మీదుగా రామాయంపేటకు వచ్చే బస్సులు సమయానికి రాకపోవడం వల్ల విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమయానికి బస్సులు నడపాలని, అలాగే అదనపు బస్సులను కూడా వేయాలని డిమాండ్ చేశారు. కాగా, విద్యార్థుల రాస్తారోకోతో రోడ్డుపై వాహనాలు నిలిచిపో వడంతో, రామాయంపేట ఎస్సై బాలరాజు అక్కడకు చేరుకొని విద్యార్థులకు నచ్చజెప్పి రాస్తారోకో విరమింపజేశారు.