calender_icon.png 29 September, 2024 | 12:32 PM

బస్సు-ట్రక్కు ఢీ: ఆరుగురు మృతి

29-09-2024 11:01:11 AM

మైహార్: మధ్యప్రదేశ్‌లోని మైహార్ జిల్లాలో బస్సు, ట్రక్కు ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు మరణించారు. దాదాపు 20 మంది గాయపడ్డారు. బస్సు ప్రయాగ్‌రాజ్ నుండి నాగ్‌పూర్‌కు వెళుతుండగా ఆగి ఉన్న రాయితో నిండిన డంపర్ ట్రక్కును ఢీకొట్టింది. జిల్లా కేంద్రానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న నదన్ దేహత్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.

గాయపడిన వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని, వారిని సత్నాకు తరలించామని మైహర్ పోలీసు సూపరింటెండెంట్ సుధీర్ అగర్వాల్ మీడియాకు తెలిపారు. మిగిలిన వారు మైహార్‌, అమర్‌పతన్‌ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే సీనియర్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారని అగర్వాల్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు.