నిర్మల్, సెప్టెంబర్ 23(విజయక్రాంతి): నిర్మల్ ఆర్టీసీ బస్సు డిపో లో పల్లె వెలుగు బస్సును ఆదివార ం అర్ధరాత్రి దుండగుడు ఎత్తుకెళా డు. రాత్రి 2 గంటల సమయంలో డిపోలోకి ప్రవేశించిన దుండగుడు బస్సును నడుపుకుంటూ డిపో గే టు వద్దకు వెళ్లాడు. సెక్యూరిటీ సిబ్బ ంది బస్సు నంబర్ వివరాలు రాసుకునేందుకు బస్సు వద్దకు వస్తుండ గా బస్సును ఆపకుండా వేగంగా ని జామాబాదు వైపు మళ్లించాడు. సె క్యూరిటీ సిబ్బంది, ఆర్టీసీ సిబ్బంది బస్సు వెనుక బైక్పై వెంబడించారు. దీంతో దుండగుడు భయంతో కం చరోడి కట్ట వద్ద చెత్తకుప్పలను ఢీకొట్టాడు. అప్పటికే ఎదురుగా వస్తున్న మరి కొంత మంది బస్సుకు అడ్డం గా నిలబడటంతో బస్సును అక్కడే నిలిపాడు. బస్సును చోరీ చేసిన నిం దితుడు మహారాష్ట్ర కీనీ గ్రామానికి చెందిన గణేష్గా గుర్తించారు. అయి తే మద్యం మత్తులో బస్సును చోరీ చేసినట్టు తెలిసింది. అతడ్ని పోలీసులకు అప్పగించారు.