జగదేవపూర్ (విజయక్రాంతి): జగదేవపూర్ మండలం మునిగడప గ్రామంలో తలారి సురేశ్ ఇంట్లో దొంగతనం జరిగింది. సురేష్ కుటుంబ సభ్యులతో కలిసి బంధువుల గ్రామానికి వెళ్లి శనివారం ఉదయం స్వగ్రామానికి వచ్చిన వారికి ఇంటి, ఇంట్లోనే బీరువా తాళాలు పగలగొట్టి కనిపించాయి. విషయాన్ని జగదేవ్పూర్ పోలీసులకు తెలియజేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని పరిశీలించారు. రూ.40 వేలు, తులం బంగారం దొంగలు ఎత్తుకెళ్లినట్లు బాధితులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చంద్రమోహన్ తెలిపారు.