calender_icon.png 25 October, 2024 | 2:50 AM

తాళం వేసిన ఇండ్లల్లో చోరీ

25-10-2024 12:53:01 AM

కామారెడ్డి, అక్టోబర్ 24 (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లాలోని ఓ గ్రామంలో దుండగులు రెండిళ్లలో చోరీకి పాల్పడ్డారు. స్థానికుల కథనం ప్రకారం.. భీంగల్ మండలం బడా భీంగల్‌కు చెందిన అన్నదమ్ములు ప్రభాకర్, ముకేశ్ ఇండ్లల్లో గుర్తు తెలియని దుండగులు బుధవారం అర్ధ రాత్రి చోరీకి పాల్పడ్డారు.

ఇద్దరు ఇండ్లకు తాళం వేసి పక్కన ఉన్న గ్రా మానికి కుటుంబసభ్యులతో వెళ్లగా ఈ దొంగతనం జరిగినట్టు బాధితులు గురువారం భీంగల్ పోలీసులకు ఫి ర్యాదు చేశారు. ఐదు తులాల బంగా రం,10 తులాల వెండి, రూ.20 వేల నగదును ఎత్తుకెళ్లినట్లు బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు భీంగల్ పోలీసులు తెలిపారు.